యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.గత వారం విడుదలైన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా మొత్తం సీరియస్ సాగే కథ. దీంతో కామెడీకి స్కోప్ ఎక్కువ లేదు. అయినప్పటికీ త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ పండించడానికి ప్రయత్నించాడు.అయితే ఆశించిన స్థాయిలో లేకపోవడం త్రివిక్రమ్ పై విమర్శలు బాగా వినిపించాయి. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ”అరవింద సమేత ఒక సీరియస్ స్టోరీ.. ఇలాంటి కథలో కామెడీ ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు..? త్రివిక్రమ్ ఏమైనా కామెడీ డైరెక్టరా..? ఆయన్ను ఎందుకు ఒక చట్రంలో బిగించాలని అనుకుంటారు.
ఆయన ఎలాంటి జోనర్ సినిమానైనా తీయగలడు. ఈసారి సీరియస్ కథ ఎన్నుకున్నాడు. ఈ కథలో హీరో తండ్రి పోగొట్టుకొని విషాదంలో సిటీకి వస్తాడు. అతడు ఎలా కామెడీ చేస్తాడు.అప్పటికీ నరేశ్ గారితో, రౌడీ బ్యాచ్ తో కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశారు. అవి తెరపై బాగా పండాయి. కథ సీరియస్ గా ఉండాలని కామెడీ డోస్ ఎక్కువ పెంచలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.ఎంతటి సీరియస్ స్టోరీ అయిన తన మాటలనే తూటాలుగా పేల్చే త్రివిక్రమ్కు ఈ సినిమాలో కామెడీ పెట్టడం ఓ లెక్క.