హీరో బాలకృష్ణ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.ఖమ్మం జిల్లాలో ఇటీవలే తన దగ్గరికి వచ్చిన అభిమానిని కాలుతో తన్ని వివాదంలో కొని తెచ్చుకున్నాడు బాలయ్య.బాలకృష్ణ ఇలా చేయడంతో అభిమానులు బాలయ్యకు వ్యతిరేకంగా బ్యానర్లు తగలబెట్టి,రోడ్డుపై బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తాజాగా నిరుపేద వృద్ధుడు బాలయ్య కాళ్లకి మొక్కుతూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ చిత్రబృందం హంసలదీవికి వెళ్లింది.షూటింగ్ కోసం బాలయ్య అక్కడకి వచ్చాడని తెలుసుకున్న ఓ వృద్ధుడు ఆయన్ని కలిసి.. తను క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించాడు.వెంటనే స్పందించిన బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆ వృద్ధుడు వివరాలు తెలియజేశారు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని బాలయ్య హాస్పిటల్ సిబ్బందికి చెప్పాడట.కాని ఈ ఫోటోని చూసిన వారందరు బాలయ్యని తప్పుగా అర్థం చేసుకున్నారు.ఇండస్ట్రీలో బాలయ్యకు భోళా శంకరుడు అనే పేరుంది.కాని తరుచు తమ అభిమానులపై కోపాన్ని చూప్తిస్తు వివాదంలో చిక్కుకుంటున్నాడు బాలయ్య.