Wednesday, May 15, 2024
- Advertisement -

‘పైసా వసూల్’ స్టంపర్ టాక్

- Advertisement -

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనతో పని చేసే ఏ హీరోని అయిన తన స్టయిల్లోకి మార్చేస్తారు. మహేష్ బాబు అయినా.. అల్లు అర్జున్ అయినా.. చివరికి కళ్యాణ్ రామ్ అయినా.. పూరి మార్క్ ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పుడు బాలకృష్ణ సైతం పూరి స్టయిల్లోకి మారిపోయాడు. ఈ రోజు రిలీజ్ అయిన ‘పైసా వసూల్’ స్టంపర్ చూస్తే అందులో బాలయ్య పూరి మార్కులోనే కనిపించాడు.

ఊర మాస్ గా.. స్టైల్ గా కనిపిస్తూ పూరి మార్కు డైలాగులతో మోత మోగించేశాడు బాలయ్య. ‘అన్నా.. రెండు బాల్కనీ టికెట్లు కావాలి’’ అని బాలయ్య అనడంతో ఈ స్టంపర్ స్టార్ట్ అవుతోంది. అందుకు జవాబుగా ‘‘ఇది సినిమా కాదు బే’’ అంటాడు రౌడీ. తర్వాత బాలకృష్ణ.. ‘‘సినిమా కాకపోతే ఇంకేటి.. ఐయామ్ ద హీరో.. యు ఆర్ ద కమెడియన్.. అండ్ విలన్ టార్చర్డ్ మై హీరోయిన్.. దిస్ ఈజ్ యన్ యాక్షన్ ఫిలిం’’ అంటూ విలన్ల పై ఫైట్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఈ స్టంపర్ అంతటా కూడా యాక్షనే యాక్షన్.

‘‘అన్నా నేను జంగిల్ బుక్ చూడలా.. అందులో సింహం నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు.. అది నిజమో కాదో మీరే చెప్పాలి’’.. ‘‘నేను మందేసిన మదపుటేనుగునురా.. క్రష్ ఎవ్రీవన్’’.. ఈ డైలాగులు కూడా అభిమానుల్ని అలరించేవే. ఈ స్టంపర్ చూస్తే కథేంటన్నది అర్థం కావడం లేదు కానీ.. ఇది పక్కా యాక్షన్ మూవీ అన్నది మాత్రం తెలుస్తోంది. సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. మొత్తానికి ‘పైసా వసూల్’లో బాలయ్యను పూరి తనదైన స్టయిల్లో చూపిస్తున్నాడు అనే విషయం అర్ధం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -