Thursday, May 2, 2024
- Advertisement -

పవన్.. వదినమ్మతో ఏం మాట్లాడారో తెలుసా..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ తన వ్యక్తుగత విషయల గురించి.. బయట ఎక్కువ మాట్లాడం చాలా తక్కువ. ఎప్పుడైన మాట్లాడితే.. అన్నయ్య చిరంజీవి కంటే కూడా.. వదిన సురేజ గురించి పవన్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాను సినిమాల్లోకి రాకముందు.. సినిమాల్లోకి వచ్చాక ఎంతగా ఇబ్బంది పడ్డాడో.. ఆ టైంలో పవన్ కి తన వదిన ఎంత సపోర్ట్ చేసిందో అనే విషయంను పవన్ ఉద్వేగంగా చెబుతుంటాడు. కొన్ని వేదకల మీద కూడా సురేఖ గురించి ప్రస్తావించాడు పవన్. దాన్ని బట్టే.. వదినతో అతడి అనుబంధం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అయితే గత కొన్నాళ్ళ నుంచి పవన్ తనకంటూ ఒక స్పేస్ ఏర్పాటు చేసుకుని.. మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెపథ్యంలో పవన్ చిరుతో అయినా.. ఆయన కుటుంబ సభ్యులతో అయినా పవన్ కనిపిస్తే.. అందరూ ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి. తాజాగా తన వదినమ్మతో కలిసి ఆత్మీయంగా పవన్ కనిపిస్తున్న ఫొటో ఒకటి అలాగే జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్టీవీ అధినేత నరేంద్రనాథ్ చౌదరి కూతురి నిశ్చితార్థ వేడుకలో.. పవన్-సురేఖ ఆత్మీయంగా కనిపించారు.

చిరు ప్రొ కబడ్డీ మ్యాచ్ కు హాజరు కావాల్సి ఉండటంతో ఈ వేడుకకు రాలేదు. దీంతో ఆ నిశ్చితార్థానికి సురేఖ మాత్రమే హాజరయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఈ సందర్భంగా వదినతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్న పవన్ ఫొటో అందరి దృష్టినీ ఆకర్షించింది. మెగా ఫ్యాన్స్ కు ఈ ఫోటో చాలా సంతోషంను కలిగించింది. అయితే వదినతో పవన్.. అన్నయ్య ఎందుకు రాలేదని.. అడిగారని.. తెలుస్తోంది. అందుకు సురేఖ ప్రొ కబడ్డీ మ్యాచ్ కు హాజరు కావాల్సి ఉండటంతో అక్కడికి వెళ్లారని చెప్పినట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=ihdjpGhZnoM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -