Sunday, April 28, 2024
- Advertisement -

ప‌వ‌న్ ఫ్యాన్స్‌పై రెచ్చిపోయిన మాజీ భార్య‌

- Advertisement -

న‌టుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌పై ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ త‌న‌దైన శైలిలో రెచ్చిపోయింది.రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రేణు రెండ‌వ వివాహ నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ రెండో వివాహంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. నీది నిజ‌మైన ప్రేమ కాదు,నిన్ను మా సొంత వ‌దినలా భావించాం,కాని మ‌మ్మ‌ల్ని మా ప్రేమ‌ను మోసం చేశావు అని కామెంట్స్ పెట్టారు.దీనిపై రేణు దేశాయ్ కూడా అదే రేంజ్‌లో వారికి కౌంట‌ర్ ఇచ్చింది.

ఎక్కువగా రెచ్చిపోతే నిజాలు మాట్లాడాల్సి వస్తుందని, అప్పుడు ఫ్యాన్స్ అందరూ మూసుకుంటారని హెచ్చరించింది. పవన్ తో విడాకుల వ్యవహారంపై చాలా ఏళ్లు నేను మౌనంగా ఉన్నందుకు మీరందరూ నాకు ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నేను నోరు విప్పి విడాకులపై నిజాలు మాట్లాడితే ఫ్యాన్స్ నోళ్లు మూసుకుంటారు.ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆన్ లైన్ వేధింపుల వ‌ల్ల రేణు దేశాయ్ ఇప్ప‌టికే ట్వీట్ట‌ర్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది.ప‌వ‌న్‌తో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసిన రేణు దేశాయ్ వివాహం చేసుకున్న కొన్నాల్లకు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -