Tuesday, April 23, 2024
- Advertisement -

ఖుషీ సెంటిమెంట్ మరో హిట్ ఇస్తుందా.. ఏప్రిల్ 27న ‘వీరమల్లు’

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను ఏ. ఎం. రత్నం నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. మొగలాయిల కాలం నాటి బందిపోటు దొంగ గా పవన్ ఈ మూవీలో కనిపించనున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మొదట ఈ సినిమానే ప్రారంభించారు. అయితే, సెట్స్ గ్రాఫిక్ వర్క్స్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు జరిగే అవకాశం ఉండడంతో ముందుగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత ప్రారంభించిన భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. భీమ్లా నాయక్ సంక్రాంతి ఈ సందర్భంగా జనవరి 12న విడుదల అవుతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగులో జాయిన్ కానున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 27న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27 పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన రోజు. ఆయన కెరీర్లో ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన ఖుషీ అదే రోజున విడుదలైంది. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఏ. ఎం.రత్నం హరిహర వీరమల్లును కూడా నిర్మిస్తున్నారు. దీంతో తమ ఇద్దరికీ బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చిన రోజే హరిహర వీరమల్లు ను కూడా విడుదల చేయాలని పవన్, రత్నం భావిస్తున్నట్లు సమాచారం. మరి ఖుషి సినిమా లాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Also Read: ఎవరూ ఊహించని కాంబినేషన్.. పాన్ ఇండియా హీరోల మల్టీ స్టారర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -