Friday, March 29, 2024
- Advertisement -

ఎవరూ ఊహించని కాంబినేషన్.. పాన్ ఇండియా హీరోల మల్టీ స్టారర్..!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమా తీసేందుకు యు.వి.క్రియేషన్స్ బ్యానర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ కు హోమ్ బ్యానర్. ఈ బ్యానర్ అధినేతలు ప్రభాస్ మిత్రులైన వంశీ, ప్రమోద్ లే. ఈ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా నటించిన సాహో అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ ప్రస్తుతం ప్రభాస్, చరణ్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే తమ సంస్థలో పనిచేసిన ఇద్దరు యువ దర్శకులతో కథలు సిద్ధం చేయిస్తోందని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైతే చరణ్ కు క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్,చరణ్ హీరోలుగా ఒక భారీ బడ్జెట్ సినిమా తీసేందుకు యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ప్లాన్ చేస్తోంది. ఈ కాంబినేషన్ నిజమైతే ప్రభాస్,చరణ్ ఫ్యాన్స్ కి ఇక పండగే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే ఆ సినిమా ఓ రేంజ్ లో ఉండటం ఖాయం.

Also Read: సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -