Sunday, April 28, 2024
- Advertisement -

‘ఛలో’ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ నిర్మాత

- Advertisement -

తొలి సినిమాతోనే అద‌ర‌గొట్టిన ద‌ర్శ‌కుడికి రెండో సినిమాకే పెద్ద బ్యాన‌ర్ నుంచి పిలుపు వ‌చ్చింది. తమ బ్యాన‌ర్‌లో త‌న సినిమా చేయాల‌ని ఆ డైరెక్ట‌ర్‌కు ఆహ్వానం అందింది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కింద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన వెంకీ కుడుముల నాగశౌర్య, రష్మిక మందనతో ‘ఛలో’ సినిమా తెరకెక్కించాడు. యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీగా యూత్‌ను ఆక‌ట్టుకుంటోంది. సినిమా వ‌సూళ్ల‌ప‌రంగా కూడా బాగానే ఉంటోంది. ఈ సినిమాకు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. భారీ వసూళ్లతో మంచి టాక్‌ను సొంతం చేసుకోవ‌డంతో అంద‌రి దృష్టి దర్శకుడు వెంకీ కుడుముల వైపు మ‌ళ్లింది.

తొలి సినిమానే సూప‌ర్‌గా తీయ‌డంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమా నిర్మాత‌ల నుంచి పిలుపువ‌చ్చింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ ఓ సినిమా చేయాల‌ని చూస్తున్నారు. వెంకీ కుడుములను పిలిపించారంట‌. వెంకీ చెప్పిన క‌థ లైన్ నచ్చడంతో సినిమా చేద్దామ‌ని అంగీక‌రించార‌ని స‌మాచారం.

స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకు రా ఆ త‌ర్వాత సినిమా మొద‌లుపెడ‌దాం అని హామీ ఇచ్చారంట‌. దీంతో వెంకీ క‌థ పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు. స్టార్ హీరో, హీరోయిన్స్‌తో సినిమా తీయ‌నున్నార‌ని స‌మాచారం. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత వెంకీ కుడుముల సినిమా ఉండే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -