Monday, May 6, 2024
- Advertisement -

మళ్ళీ వెండి తెరపై మెరవనున్న ‘ఆర్ ఎక్స్ 100’ జంట

- Advertisement -

అజయ్ భూపతి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో కార్తికేయ మరియు హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత కార్తికేయ కెరీర్ లో మాత్రం పెద్దగా ఎటువంటి మార్పులు రాలేదు. ఇంకా ఇండస్ట్రీలో ఒక హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు ఈ యువ హీరో. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తర్వాత కార్తికేయ ‘హిప్పీ’ అనే సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. తాజాగా కార్తికేయ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘గుణ 369’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరోవైపు పాయల్ రాజ్ పుత్ మాత్రం చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులతో పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. కొన్ని ఐటెం సాంగ్ లో కూడా కనిపించిన పాయల్ రాజపుత్ చేతిలో ప్రస్తుతం వెంకటేష్-నాగచైతన్య మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీమామ’, రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం కార్తికేయ మళ్ళీ పాయల్ తో ఒక సినిమా చేయటానికి సిద్దం అవుతున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -