Tuesday, May 14, 2024
- Advertisement -

ఏడుస్తానంటున్న జిగేల్ రాణి

- Advertisement -

సినిమా ఫెయిల్ అయితే ఏడ్చేస్తానంటుంది జిగేల్ రాణి. త‌న న‌టించిన సినిమా ఫ్లాప్ అయితే నాకు చాలా భాద‌గా ఉంటుంద‌ని అప్పుడు ఎవ‌రిని ఫేస్ చేయ‌లేన‌ని ఎవ‌రైనా కామెంట్స్ చేస్తారేమో అనే భ‌యంగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.కెరీర్ మొద‌ట్లో త‌మిళ్ సినిమాలు చేసిన పూజ త‌రువాత తెలుగులో అవ‌కాశాలు వ‌స్తున్న ద‌శ‌లో బాలీవుడ్‌పై మోజుతో అక్క‌డికి వెళ్లింది. అక్క‌డ ఈమె సినిమా ఘోరంగా ఫ్లాప్ కావ‌డంతో పూజ‌ని ఎవ‌రు ప‌ట్టించుకొలేదు.

త‌రువాత మ‌ళ్లీ తెలుగులో అల్లు అర్జున్ ప‌క్క‌న డీజే సినిమాలో చేసింది. ఈ సినిమాలో బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసింది. ఈ సినిమా హిట్ కావ‌డంతో తెలుగులో వ‌రుస సినిమాలు వ‌స్తున్నాయి.ఎన్టీఆర్‌,మ‌హేష్‌,ప్ర‌భాస్ పక్క‌న హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసింది.మొన్న వ‌చ్చిన రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాలో ఐటం సాంగ్‌లో మెరిసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -