- Advertisement -
బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్నసినిమా సాహో.భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాను 2019 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇప్పటికే దుబాయ్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించిన చిత్రయూనిట్ త్వరలో మరో యాక్షన్ సీన్కు రెడీ అవుతున్నారు.ఈ సారి రొమానియాలో ఓ భారీ చేజ్ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్తో పాటు ప్రతినాయక పాత్రలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది.