Tuesday, May 7, 2024
- Advertisement -

సాహో విషయంలో రిస్క్ వద్దు అనుకుంటున్న ప్రభాస్

- Advertisement -

నిజానికి ప్రభాస్ తన సినిమా నిర్మాణానంతర పనులలో అంతగా జోక్యం చేసుకోడు కానీ ‘సాహో’ విషయంలో మాత్రం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ ప్రభాస్ రెస్ట్ తీసుకోకుండా స్వయంగా వెళ్లి విజువల్ ఎఫెక్ట్స్ పనులను చూడటం, వాళ్లకి డెడ్ లైన్ ఇచ్చి అప్పటిలోగా ఫైనల్ ప్రొడక్ట్ ని పూర్తి చేయమని చెప్పడం వంటివి చేస్తున్నాడు ప్రభాస్. మరోవైపు దర్శకుడు సుజిత్ రికార్డింగ్, డబ్బింగ్ తదితర పనులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘సాహో’ కి చాలావరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు గిబ్రాన్.

తాజా సమాచారం ప్రకారం హిందీ, తమిళ్ మరియు మలయాళం వెర్షన్ ల డబ్బింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కి ప్రభాస్ స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నాడు. సుజిత్ యువ దర్శకుడు కాబట్టి అతనికి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ప్రభాస్ ఇలా అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటుంన్నట్టు సమాచారం. అంతేకాకుండా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కాబట్టి ప్రభాస్ ‘సాహో’ విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని నిర్ణయించుకున్నాడట. ‘సాహో’ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -