Saturday, May 11, 2024
- Advertisement -

సెకెండ్ ఇన్నీంగ్స్‌ను ప్రారంభించ‌నున్న మైనే ప్యార్ కియా హిరోయిన్ భాగ్య‌శ్రీ…

- Advertisement -

ఒకొప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో ఒక వెలుగు వెలిగి పెళ్లి త‌ర్వాత కొన్నాల్లు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండి త‌ర్వాత సెకెండ్ ఇన్నీంగ్స్ మొద‌లు పెడుతున్నారు హీరోయిన్‌లు. అలాంటి వారిలో అత్తారింటికి దారేది సినిమాలో న‌దియా, అజ్ణాత వాసి సినిమాలో కుష్బులాంటి వారుతెర‌పై మెరుస్తున్నారు. తాజాగా అల‌నాటి స్టార్ హీరోయిన్ మ‌రో సారి తెర‌మీద క‌నిపించేందుకు సిద్ద‌మ‌వుతోంది.

అమె ఎవ‌రో కాదు భాగ్య‌శ్రీ. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్‌ సినిమా ‘ మైనే ప్యార్‌ కియా’ ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. తెలుగులో ప్రేమ పావురాలుగా డబ్ చేస్తే ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫెవరెట్ నటి.

ముఖ్యంగా భాగ్యశ్రీ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తరువాత ఒకటి రెండు సినిమాలు తెలుగులో చేసినా..అవి తనకు కలిసిరాలేదు. కానీ ఇన్నేళ్ల తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించటానికి సన్నాహాలు చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 2 స్టేట్స్ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అడివి శేష్‌, శివాని ( జీవిత రాజశేఖర్‌ కుమార్తె) జంటగా నటించబోతున్నారు. హీరో తల్లి పాత్రకు భాగ్యశ్రీ అయితేనే న్యాయం చేస్తుందని భావించి ఆమెను కలిసి ఒప్పించారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -