Thursday, May 9, 2024
- Advertisement -

మోదీకి నోటీసులు పంపిన ప్రియాంక చోప్రా

- Advertisement -

మోదీకి ప్రియాంక నోటీసులు పంప‌డం ఏంటీ అనుకుంటున్నారా! అవును ప్రియాంక చోప్రా మోదీకి లీగ‌ల్ నోటీసులు పంపించింది.అయితే అది మ‌న ప్ర‌ధాని నంరేంద్ర మోదీకి కాదులేండీ.నీరవ్ మోదీ ఈయ‌న ఇండియాలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి. లగ్జరీ డైమండ్ జ్యువెల్లర్ నీరవ్ మోడీ చేస్తున్న వ్యాపారాలకు ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నది. నీరవ్ మోడీకి ప్రియాంక చోప్రా తాజాగా లీగల్ నోటీసులు పంపింది. యాడ్స్ చేసినందుకు తనకు రావాల్సిన డబ్బు ఇంకా చెల్లించక పోవడంతో ప్రియాంక చోప్రా ఈ నోటీసులు జారీ చేశారు.

ప్రియాంక చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, లీసా హెడెన్ లాంటి వారితో తమ ఆభరణాలకు ప్రచారం చేయించారు. ప్రియాంక చోప్రా తన లాయర్ ద్వారా అతడికి లీగల్ నోటీసులు పంపారు. ప్రియాంక చోప్రాకు కొన్ని కోట్ల రూపాయలు నీరవ్ మోడీ నుండి రావాల్సి ఉందని తెలుస్తోంది. ప్రియాంకతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కూడా నీరవ్ మోడీ తమ వ్యాపార ప్రచారానికి వాడుకుని డబ్బు ఎగ్గొట్టినట్లు సమాచారం.అంద‌రు మోదీ అన‌గానే మ‌న ప్ర‌ధాన మంత్రి మోదీ అనుకుంటున్నారు. పాపం దీనిపై బీజేపి ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -