భాషా ఏది అయిన సక్సెస్ ఉంటేనే గుర్తింపు ఉంటుంది.ఒక్కసారి ఇక్కడ ఫెయిల్ అయితే సక్సెస్ ఇచ్చిన వాళ్లు కూడా కన్నెత్తి చూడరు. ఈ విషయం డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్కు బాగా తెలుసు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి,దేశముదురు, బిజినేస్ మ్యాన్ ఇలా వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఆట ఆడుకున్న పూరి తరువాత వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ మధ్య టెంపర్తో టచ్లోకి వచ్చిన రోగ్, జ్యోతిలక్ష్మితో మళ్లీ ఫ్లాప్ల బాట పట్టాడు. ప్రస్తుతం తన కొడుకు హీరోగా మెహబూబా అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా చివరి దశకు చేరటంతో తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు పూరి. సాధారణంగా పూరి దగ్గర రెండు మూడు కథలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. తన దగ్గర కథకు రాంచరణ్ సూట్ అవ్వడంతో చరణ్కి కథ వినిపించాడు అని టాక్.అసలు రాంచరణ్ ఎంట్రీ ఇచ్చిందే పూరి జగన్నాథ్ డైరక్షన్ చిరుత సినిమాతో.మరి వరుస ఫ్లాప్లలో ఉన్న పూరికి రాంచరణ్ ఓకే చేస్తాడా? దానికి మెగాస్టార్ చిరంజీవి ఓప్పుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా భవితవ్యం మెహబూబా సినిమా పై ఆధారపడి ఉంది.