Thursday, April 25, 2024
- Advertisement -

‘రాధేశ్యామ్’ తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే ?

- Advertisement -

ప్రభాస్​-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్​ అయింది. కలెక్షన్ల పరంగా తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు సినీవిశ్లేషకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా తొలి రోజు రూ.48 కోట్లు వసూలు చేస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. నైజాంలో ఆల్​ టైం రికార్డు స్థాయిలో రూ.15 కోట్లు అందుకున్నట్లు సినీవర్గాల టాక్.

ఇక హిందీలో రాధేశ్యామ్ తొలిరోజు రూ.2.50 కోట్ల కలెక్షన్లు రాబట్టిందనట్లు సమాచారం. రాధే శ్యామ్​ మూవీ శాటిలైట్​ రైట్స్‌ను రూ.100 కోట్లకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ రైట్స్‌కు కూడా భారీగానే అమ్ముడుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో UV క్రియేషన్స్‌ రాధేశ్యామ్ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. ఈ సినిమాలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -