సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి,కాలా సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు.దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేటా’ అనే సినిమా చేస్తున్నాడు రజనీ.గత నెలలోని సినిమా టైటిట్తోపాటు రజనీ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు చిత్ర యూనిట్.తాజాగా సినిమాలోని రజనీ రెండో లుక్ని విడుదల చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ మాసివ్ లుక్ తో మెప్పించగా.. తాజాగా విడుదలైన లుక్ లో మాత్రం తెల్ల చొక్కా, పెద్ద మీసాలు, బొట్టు పెట్టుకొని క్లాస్ గా కనిపించారు.
దీన్ని బట్టి సినిమాలో రజినీకాంత్ పాత్రకి రెండు షేడ్స్ ఉంటాయని అర్ధమవుతుంది.పేట్టా సినిమా కథ 1980 నాటి కథతో తెరకెక్కితుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. సినిమాలో విలన్గా హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు.ఫస్ట్ టైం రజనీ సరసన త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. సినిమాను త్వరగా పూర్తి చూసి దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.