దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుంది. ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ అందరికీ టెన్షన్ పుట్టిస్తుంది. ఇక మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. తాజాగా నటి రకూల్ ప్రీత్ సింగ్ కి కరోనా పాజిటీవ్ వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా తాను ప్రకటించింది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని చెప్పింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది. త్వరలోనే పూర్తిగా కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటానని చెప్పింది. ఇక బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్న ఆమె ఏకంగా మూడు హిందీ సినిమాలకు కమిటై ఉండి.
ఇవిగాక రెండు తమిళ సినిమాలు కూడా ఓకే చేసింది. అలాగే కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 లోనూ ఆమె నటిస్తోంది. మరోవైపు, రకుల్ కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.