Friday, May 3, 2024
- Advertisement -

రెమ్యునరేషన్ విషయంలో తగ్గనంటున్న రకుల్

- Advertisement -

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినప్పటికీ మహేష్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న రకుల్ ప్రీత్ ఆ తరువాత తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ చేయలేదు. తమిళ్ డబ్బింగ్ సినిమాలు ‘దేవ్’ మరియు ‘ఎన్ జి కే’ లో కనిపించిన రకుల్ ప్రీత్ ఆ రెండు సినిమాలతో కూడా అతి పెద్ద డిజాస్టర్ లను అందుకుంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హిట్ సినిమా అందుకోవడం రకుల్ ప్రీత్ కి చాలా అవసరం. అయితే ఇలాంటి సమయంలో కూడా రెమ్యునరేషన్ విషయంలో రకుల్ ప్రీత్ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.

తాజాగా రకుల్ ప్రీత్ తెలుగులో సీనియర్ హీరో నాగార్జున సరసన ‘మన్మధుడు 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ ఏకంగా 1.5 కోట్ల రూపాయలను పారితోషకం గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరి ఈ సినిమాతో రకుల్ ప్రీత్ ఒక మంచి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -