- Advertisement -
రంగస్థలం వంటి హిట్ తరువాత రామ్ చరణ్ ,బోయపాటి శీను దర్శక త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమా మొదలై చాలాకాలం అయిన ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన టైటిల్ కాని,ఫస్ట్ లుక్ కాని విడుదల చేయలేదు.తాజాగా సినిమాకు సంబంంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్.దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
నవంబర్ 6న మధ్యాహ్నం ఒంటి గంటకి చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టీజర్ ని నవంబర్ 9న ఉదయం 10 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.