ఈ మధ్య టాలీవుడ్ వ్యవహరశైలిలో మార్పు వచ్చినట్లు ఉంది. ఒకరి సినిమా ఆడియో ఫంక్షన్కు మరోకరు వెళ్లుతున్నారు. ఒకరు సినిమాను మరోకరు అభినందిస్తున్నారు.మొన్న ఆ మధ్య మహేష్ బాబు భరత్ నేను సినిమా ఆడియో ఈవెంట్కు ముఖ్య అతిధిగా వచ్చాడు తారక్.ఆడియో ఈవెంట్ తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో ప్రిన్స్ మహేశ్ బాబు, మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా టాలీవుడ్ హీరోలు అందరు కలిసిమెలిసి ఉంటున్నారు. తాజాగా తమ మధ్యే కాదు తమ కుటుంబాల మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం ఉందనేలా చెర్రీ దంపతులు, ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు.శనివారం ఎన్టీఆర్, ప్రణతి దంపతుల పెళ్లి రోజు వేడుకకు(శనివారం) చెర్రీ దంపతులు హాజరయ్యారు. ఎన్టీఆర్ దంపతులతో కేక్ కట్ చెయించారు. అలాగే ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్తో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Tooo tooo cute #followfollowU @tarak9999 #RamCharan pic.twitter.com/K0dszQkrGe
— Upasana Konidela (@upasanakonidela) May 5, 2018