దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్కు తెర లేపాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్లను హీరోలుగా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ఈ రోజేనే మొదలు పెట్టనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నాడని సమాచారం. ఈ సినిమాకి ‘RRR’అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. వర్కింగ్ గా టైటిల్ గా ‘RRR’ అని పెడితే రామ్ చరణ్, రామారావు, రాజమౌళి అని అందరూ అనుకున్నారు.
అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇవి పేర్లు మాత్రమే కాదు.. అసలు టైటిల్ ఇందులోనే ఉందని అంటున్నారు. అదేంటంటే.. ”రామ రావణ రాజ్యం”. కథకు తగ్గట్లుగా ఈ టైటిల్ ఉంటుందని దీన్నే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ విలన్గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.అయితే ఇది ఈ వార్తల్లో నిజం లేదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.