Thursday, May 2, 2024
- Advertisement -

రానా సెలక్షన్ అదుర్స్… టోటల్లీ కొత్త లుక్..

- Advertisement -

టాలీవుడ్ హంక్ రానా మూమెంట్స్ చూస్తుంటే మేథావులకు ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఇతగాడు కూడా ఓ మేథావే అనే విషయానికి మేథావులంతా వచ్చేశారు. మీరు సరిగా అబ్సర్వ్ చేశారో లేదో రానా సెలెక్ట్ చేసుకుంటోన్న చిత్రాలన్నీ చాలా ప్లానింగ్ తో ఎంచుకుంటున్నవే అనే విషయం అర్ధమైపోతుంది.

బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు చూశాక అబ్బాయిగారి లెక్కలు ఎలా ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా రానా వార్ బ్యాక్ డ్రాప్ లో తమిళంలో మదై తిరందు అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాహుబలి సినిమా తర్వాత నాజర్ – సత్యరాజ్ వంటి బాహుబలి సీనియర్ నటులతో మళ్లీ కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ కేరళలో జరుగుతోంది. కొన్ని రోజులు ఈ చిత్ర యూనిట్ అక్కడే ఉంటుందట. ఈ సందర్భంగా వీరు ముగ్గురూ ఒక షూటింగ్ స్పాట్ లో కనిపించడంతో బాహుబలి టీం రీ యూనియన్ లా ఉందనే కాంప్లిమెంట్లు వచ్చాయి.

మదై తిరందు సినిమాలో రానా టోటల్లీ కొత్త లుక్ లో కలరింగ్ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా రెజీనా కెసాండ్రా చేస్తోంది. ఈ ఫిలింను టాలీవుడ్లో 1945 పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఫ్రీడం కోసం బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేసేందుకు అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ పేరుతో ఓ ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశారు. ఈ ఐఎన్ఏలో పోరాడిన ఓ సైనికుడి జీవితగాథతో 1945 సినిమా సెట్స్ మీదకెక్కింది. బాహుబలిలో గదతో వార్ సీన్ లో కనిపించిన మనోడు.. ఈమూవీలో…. గన్నుతో యుద్ధరంగంలో దిగుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -