Tuesday, May 21, 2024
- Advertisement -

కొత్త ఫిగ‌ర్‌ని ప‌ట్టిన రామ్‌?

- Advertisement -

హీరో రామ్ కొత్త ఫిగ‌ర్‌ని ప‌ట్టేశాడు.రామ్ ఫిగ‌ర్‌ని ప‌ట్ట‌డం ఏమిటి అనుకుంట‌టున్నారా?. ఏం లేదండీ ..రామ్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఇటివల విడుదలై మంచి విజయం సాధించింది. తరువాత సినిమా దిల్ రాజు నిర్మాణంలో రామ్ నటించబోతున్నాడు.డైర‌క్ట‌ర్‌త్రినాద్ రావ్ నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ‘నేను లోకల్’ సినిమా తరువాత చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ అన్వేష‌ణ‌లో ప‌డ్డారు చిత్ర యూనిట్‌.తాజా స‌మాచ‌రం ప్ర‌కారం ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని టాక్‌. రష్మిక ప్రస్తుతం నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ, పరుశురామ్ ల చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే ఈ హీరోయిన్ మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం విశేషం. రామ్, త్రినాద్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి రెండోవారం నుండి ప్రారంభంకానుంది.ఆ విధాంగా రామ్ కొత్త భామ ర‌ష్మిక ను పెట్ట‌కోవ‌డం జ‌రిగింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -