రవితేజ తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. రాజా ది గ్రేట్తో హిట్ కొట్టిన తరువాత వచ్చిన టచ్ చేసి చూడు నిరాశ పరిచింది.ఇప్పుడు తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ నేల టిక్కెట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు.
మే 10న జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.కల్యాణ్ కృష్ణ వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టాడు,ఈ సినిమాతో హాట్రిక్ పూర్తి చేయలనే కసితో ఉన్నాడు.ఈ సినిమాను మే నెల చివరిలో విడుదల చేయలని భావిస్తున్నారు.
Its a mixed feeling.. very happy and damn missing .. just done wit last day shoot of #nelatickettu wit mass maharaj..
loved working wit @RaviTeja_offl😍love you sir ❤️🤗— Kalyankrishnakurasala (@kalyankrishna_k) May 7, 2018