Friday, March 29, 2024
- Advertisement -

నా ప్రియమైన వ్యక్తిని కరోనా తీసుకెళ్లింది.. కన్నీళ్లు పెట్టుకుంటున్న పాయల్ రాజపుత్!

- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.సినీ ఇండస్ట్రీలోనూ చాలా మంది దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ కరోనా కాటుకు గురయ్యారు.ఇప్పుడు స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా కరోనా కారణంగా తనకు యిష్టమైన వ్యక్తిని కోల్పోవాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎంతో అభిమానించే, తనకు ఇష్టమైన అనితా ఆంటీ కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిపింది. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు కానీ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారని ఎమోషనల్ అయింది పాయల్ రాజ్‌పుత్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది దాంతో ఆమె అభిమానులు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలంటూ సూచిస్తూ, విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also read:నాకు ఒక్క ఫోన్ చెయ్యండి.. శేఖర్ మాస్టర్ దాతృత్వం!

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ విషయానికొస్తే తెలుగు ఇండస్ట్రీ కుర్రకారులో యమ క్రేజ్ వున్న పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన” RX 100 ” మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో కట్టిపడేసింది.ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న “పుష్ప “సినిమాలో ఈమె ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -