Sunday, April 28, 2024
- Advertisement -

రెండో సారి సినిమా చూడండి: సాహో దర్శకుడు

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా ఆగస్టు 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రద్ధ కపూర్, జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ వంటి ప్రముఖ నటీనటులు ఉండటంతో సినిమాకి మరింత మార్కెట్ పెరిగింది. పైగా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన మేకింగ్ వీడియోలు, పాటలు, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను కనువిందు చేస్తాయి అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక పాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సైయాన్ సైకో, బ్యాడ్ బాయ్ వంటి పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లు గా మారాయి. సినిమాపై మంచి ప్రీ రిలీజ్ బజ్ నడిచింది కూడా.. యూవీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ఘిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేసించాయి. అన్నీ పక్కన పెడితే సినిమా విడుదల అయింది, కానీ అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ దర్శకుడు సుజీత్ మాత్రం సినిమా ని రెండో సారి చూడని, ఇంకా ఎంజాయ్ చేస్తారు అంటున్నాడు. మొదటి సారి చూసిన వాళ్ళు అనేకమంది సినిమా నచ్చలేదు అని చెప్పినా, ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇంకో సారి చూస్తే ఇంకా బాగుందే అవకాశం ఉంటుంది అని ప్రమోట్ చేయడం లో ఎంత వరకు కరెక్ట్ అని ఆయనే నిర్ణయించుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -