Friday, April 19, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ బాటలో సాయి ధరం తేజ్ వెల్తున్నాడా….?

- Advertisement -

మెగా హీరో సాయి ధరం తేజ్ చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఫెయిల్యూర్, సక్సెస్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక ఆ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా క్లీన్ హిట్ సాధించి సాయి ధరం ను మళ్ళీ టాప్ చైర్ లో కూర్చుబెట్టింది.. ఒక్కసారి గా పోయిన స్టార్ డం అంతా తిరిగి ఈ సినిమా తో సంపాదించుకున్నట్లయ్యింది.. మారుతీ కి కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ కాగ సాయి ధరం తేజ్ ఇలాంటి సినిమా అప్పటివరకు చేయకపోవడం గమనార్హం..

వరుసగా రెండు హిట్లు సాధించిన జోష్ లో సాయి ధరం తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే వెరైటీ సినిమా చేస్తున్నారు.. తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కాగ వీరి కంబోలో వచ్చిన అన్ని చిత్రాలు మ్యుజికల్ గా హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు.. అందుకే సాయి ధరం తేజ్ అవసరమైతే తప్పా సంగీత దర్శకుడిని మార్చడు.. ఇక సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వార పరిచయమవుతున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్ కి మంచి పేరు రాగ తేజు కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు..

ఈ సినిమా లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. థియేటర్ లు ఆరు నెలలుగా మూతపడి ఉన్న కారణంగా పలు సినిమాలై డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఓటీటీలో కొత్త తరహాలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన పలు సినిమాలను పే పర్ వ్యూ అనే పద్దతిలో విడుదల చేశాడు. చిన్న సినిమాలకు టికెట్లు పెట్టిన వర్మ లక్షల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఆయన దారిలోనే మరికొందరు స్టార్స్ కూడా తమ సినిమాలను పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారట. వర్మ సినిమా పాటలోని లైన్ తో వస్తున్న ఈ సినిమా వర్మ రిలీజ్ చేస్తున్న సినిమాలనే రిలీజ్ చేయడం కొంత విశేషం అని చెప్పాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -