బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ తన కుతురు వ్యవహారంలో కోర్టుకు మెట్లు ఎక్కారు. సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ ‘కేదర్నాథ్’ సినిమా డేట్స్ విషయంలో గొడవలు రావడంతో సదరు చిత్ర యూనిట్ సారా మీద కోర్టులో దావా వేసింది.ముంబై హైకోర్టు శుక్రవారం ఈ విషయాన్ని విచారించనుండటంతో సారా, తండ్రి సైఫ్ అలీఖాన్తో కలిసి కోర్టుకు హజరైంది.సారా అలీఖాన్ కేదార్నాథ్ సినిమా ద్వారా బాలీవుడ్కు పరిచయమవుతుంది.
అయితే నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో సారా, రోహిత్ శెట్టి తెరెక్కిస్తున్న ‘సింబా’ సినిమా కోసం డేట్లు అడ్జస్ట్ చేశారు. అదే సమయంలో మరో నిర్మాత దొరకటంతో కేదార్నాథ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. కాని సారా మాత్రం సింబా షూటింగ్ పూర్తయ్యాకే కేదర్నాథ్ చిత్రీకరణలో పాల్గొంటారని తేల్చి చెప్పింది.దీంతో కేదర్నాథ్ నిర్మాతలు సారా మీద కోర్టులో దావా వేసారు.