Friday, May 24, 2024
- Advertisement -

శ్రీరెడ్డి,వ‌ర్మ, ప‌వ‌న్ వివాదంపై క‌త్తి మ‌హేష్ ట్వీట్‌….

- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న క్యాస్టింగ్‌ కోచ్‌ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీశ‌క్తి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అన్ని వ‌ర్గాల‌నుంచి వ‌ర్మ‌, శ్రీరెడ్డిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అల్లూ అర‌వింద్ కూడా వ‌ర్మ‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

తాజాగా దీనిపై క‌త్తి మ‌హేష్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారు? శ్రీరెడ్డా? రాంగోపాల్‌ వర్మనా? మెగా ఫ్యామిలీనా? అని సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు. ‘శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన చేస్తే క్యాష్‌ కమిటీ ఏర్పడుతోంది. ఒక స్టార్ ని బూతు మాట అంటే.. పరిశ్రమ పెద్దలు అందరూ స్పందిస్తారు. అంటే ఒక రకంగా శ్రీరెడ్డి చేసింది కరెక్టేనా! షాక్ ఇచ్చి షేక్ చేస్తేతప్ప సరైన స్పందన రాదా!?’ అని ఆయన ప్రశ్నించారు.

రాంగోపాల్ వర్మ తాను శ్రీరెడ్డితో చేసిన సోషియల్ ఎక్స్ పెరిమెంట్‌ను ఒప్పుకోకపోయి ఉంటే ఇదేదో పెద్ద రాజకీయ కుట్ర అని ఈపాటికి నిరూపించేవాళ్ళు. అసలు సమస్య పక్కదారి పట్టి విషయం ఎక్కడెక్కడికో వెళ్లిపోతోంది. బహుశా అందరికీ కావలసినది ఇదేనేమో’ అంటూ కత్తి మహేశ్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -