బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ పై ఫాన్స్ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆమను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.పూర్తి వివరాల్లోకి వెళ్తే… షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ తాజాగా ఓ యాడ్లో నటించింది.తల్లి అయిన తరువాత తన ముఖంలో కొన్ని మార్పులు వచ్చాయని వాటిని ఈ క్రీమ్ తొలగించింది ఈ నా రీబార్న్ స్టోరీ అంటూ తన రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నానని యాడ్ లో చెప్పుకొచ్చింది.
గతంలో మీరా రాజ్ పుత్ . ‘చర్మసౌందర్యం కోసం సహజ సిద్ధమైన ఉత్పత్తులే వాడతానని చెప్పారు.కాని ఆమె మాట తప్పడంతో నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.ఇలాంటి యాడ్స్ లో నటించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి’ మీరు మాట తప్పారు, మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా ఉందంటూ ఆమెను నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు.యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎంత పని చేసిందని కొందరు చర్చించుకుంటున్నారు.షాహిద్ కపూర్ -మీరా రాజ్ పుత్ జంట రెండో సంతానం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.