Monday, April 29, 2024
- Advertisement -

దర్శకనిర్మాతలు మోసం చేస్తున్నారు : హీరోయిన్ శ్రీయా

- Advertisement -

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది శ్రియా. ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీయా.. తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా సీనియర్లందర్నీ కవర్ చేసిన శ్రియా ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటివారతోనూ నటించింది. అయితే పెళ్లి చెసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. గతేడాది పెళ్లి చేసుకున్న శ్రీయ.. భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌తో కలిసి ఉంటుంది.

వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్‌ను ఈ జంట మరింత ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భర్తతో వంటింటి పనులు చేయిస్తూ తన భర్త చేస్తోన్న సేవలను సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తోంది. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. మంచి కథ ఉన్న సినిమా చేయాలనుకుంటున్నాను. అయితే కొందరు దర్శకనిర్మాతలు మోసం చేస్తున్నారని ఆరోపించింది.

చెప్పే కథ ఒకటి… తీసే కథ మరొకటని మండిపడింది. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయని చెప్పింది. ఒక రెండు లైన్లు కథ చెప్పి మోసం చేయాలనుకునే వారికి ’నో’ చెబుతున్నానని శ్రీయ తెలిపింది. ఇక స్పెషల్ సాంగ్ చేస్తాను.. కానీ ఆ సాంగ్ ఆ సినిమాకు ప్లస్ అయితేనే చేస్తాను. లేకుంటే చేయను అని శ్రీయ చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -