మీడియాపై శ్రియ ఆగ్రహం
తెలుగు సినీ పరిశ్రమలో శ్రియ అందరూ అగ్ర కథనాయకులతో జోడీ కట్టింది. పదేళ్ల కిందట మొత్తం శ్రియ చేతిలోనే సినిమాలు ఉండేవి. ఇప్పుడు హీరోయిన్గా పెద్దగా అవకాశాలు లేకున్నా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం‘గాయత్రి’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శ్రియ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు బాగానే సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత విషయాల్లో భాగంగా పెళ్లి గురించి అడిగారు. ఆ ప్రశ్న వినగానే శ్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మైండ్ యువర్ బిజినెస్’ అంటూ మీడియాను హెచ్చరించింది. ‘నా పర్సనల్ విషయాలతో మీకేం పని?’ అన్నట్టు మాట్లాడింది.
పబ్లిక్ పర్సన్ కావడంతో పెళ్లి, ప్రేమ గురించి సాధారణంగా ప్రశ్నలు వేస్తారు. దీనిపై అంతా ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైతే చెప్పాలి.. లేదంటే ఊకుండాలి గానీ ఇలా ప్రవర్తించడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.