టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ తన నోరుకి పని చెప్పింది.తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్లో జరుగుతున్న పరిణమాలపై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ దుర్వినియోగం చేశారంటూ వచ్చిన కథనాలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ లో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ రాజా ,నరేష్ల మధ్య వివాదం పెద్దది కావడంతో పాటు మీడియా ఎదుట మీరు అంటే మీరు అనే స్థాయికి వెళ్లింది గొడవ.ఈ క్రమంలోనే శ్రీరెడ్డి వ్యవహారంలో మా తీరును నరేష్ తప్పుబట్టారు. శ్రీరెడ్డి విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నామని అన్నారు.
ఈ నేపథ్యంలో నరేష్ వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి స్పందించింది.నరేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను మోసపోయి వస్తే ఓదార్చాల్సింది పోయి బడా ఫ్యామిలీస్ ని కాపాడే ప్రయత్నం చేశారని మండిపడింది. తనకు కోట్ల రూపాయలు ఇచ్చి మభ్యపెట్టాలని శివాజీ రాజా అతడి తొత్తులు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పింది. తన తల్లిదండ్రులనే చూడలేని శివాజీ రాజా ముసలోళ్లకి వృద్దాశ్రమం గురించి అమెరికాలో ఈవెంట్ చేశారని చెప్పడం విడ్డురంగా ఉందని తెలిపింది.అమెరికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది.కాస్టింగ్ కౌచ్ సమయంలోనే శివాజీ రాజాపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.