- Advertisement -
కొద్దిరోజుల క్రితం కాస్టింగ్ కౌచ్ ఆరోపనలతో టాలీవుడ్ని షేక్ చేసింది శ్రీరెడ్డి. ప్రముఖలపై ఆరోపణలు చేసి దేశ వ్యాప్తంగా సంచలనాలకు తెరతీసింది. అంతేకాదు కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తారలపై కూడా కామెంట్స్ చేసింది. పవన్పై చేసిన వ్యాఖ్యలై ఎంత దుమారం రేగిందో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి, పవన్ అభిమానుల మధ్య సోషిల్ వార్ జరగిన సంగతి తెలసిందే.
తాజాగా పవన్పై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి పవన్ అభిమానులకు మరో సారి టార్గెట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఘోర పరాభవం తప్పదని శ్రీరెడ్డి జోస్యం చెప్పింది. జనసేన కేవలం 3-4 సీట్లకే పరిమితమయ్యే అవకాశముందని వ్యాఖ్యానించింది.
రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తనను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే తనకు ఆసక్తి లేదని తెలిపింది. సోషల్ మీడియాలో తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కన్ఫర్మ్ చేసింది.