పెళ్లి జరిగిన ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికి శ్రీ దేవి, బోణి కపూర్ ల మధ్య ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు బోనీకపూర్ ను పెళ్లి చేసుకుంటానని శ్రీదేవి ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. బోణి కపూర్ పెళ్లి అయింది. అయిన శ్రీదేవి లాంటి అందగత్తెను ఎవరైనా కావాలనుకుంటారు.
అయితే బోణి కపూర్, శ్రీదేవి ల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత బోణి కపూర్ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శ్రీ దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చారు. అయితే సినిమా ఫీల్డ్ లో కలవడం విడిపోవడం సాధారణం. వీళ్ళ జంట కూడా ఎక్కువ కాలం నిలవదని చాల మంది అనుకున్నారు. కానీ ఇన్నేళ్లు అవుతున్న వాళ్ళ మధ్య అనురాగం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అందుకు ఉదాహరణ ఈ ఫోటో. రోజు రౌజుకి వారి మధ్య ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
బయట ఎక్కడికైనా వీరిద్దరూ జంటగానే వెళ్తారు. హైదరాబాద్, చెన్నై, ముంబైల్లో జరిగే ఫంక్షన్లకూ వీరు జంటగానే హాజరవుతారు. తాజాగా ముంబైలో జరిగిన దీపావళి పార్టీకి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. అక్కడే శ్రీదేవికి బోనీ కపూర్ ప్రేమతో ఇలా ముద్దు పెట్టారు. ఈ ఫోటోను శ్రీదేవి ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. రొమాన్స్ కి వయసుతో పని లేదని చెప్పడానికి ఈ జంట ఆదర్శం.