Sunday, May 12, 2024
- Advertisement -

‘సాహో’ సినిమాపై రాజమౌళి కోత

- Advertisement -

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులతో చిత్రబృందం బిజీగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఈ మధ్యనే చూశారట. అంతేకాకుండా సినిమా కొంచెం లెందీ గా ఉందని, రన్ టైం మూడు గంటలకి దగ్గరగా ఉండటంతో 18 నిమిషాలు తగ్గించమన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి సలహా తీసుకున్న సుజిత్ మరియు చిత్రబృందం కూడా సినిమా లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి రన్ టైం ని 2 గంటల 52 నిమిషాల వరకు తీసుకు వచ్చారట ఇప్పటిదాకా ఫెయిల్యూర్ చవిచూడని ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడు కావడంతో రాజమౌళి సలహాని సీరియస్ గా తీసుకుని చిత్రబృందం సినిమాని ట్రిమ్ చేసినట్లు తెలుస్తుంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ శ్రోఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -