టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు మరో బంపర్ తగిలినట్లు తెలుస్తుంది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేశారు.మహేశ్ కోసం సిద్దం చేసిన కథను ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కించాడనికి ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.మహేశ్ కోసం తెలంగాణ నేపథ్యంలో ఓ కథను సిద్దం చేసి వినిపించాడట సుకుమార్ అయితే ఈ కథ తనకు సెట్ కాదని చెప్పి,తన కోసం వేరే కథను సుకుమార్ను కోరారు మహేశ్.దీంతో మహేశ్ కోసం రాసుకున్న కథను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాడని సుకుమార్ రెడీ అయ్యాడని సమాచారం.
తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కావడం వలన, విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోతాడని ఆయన భావించాడని అంటున్నారు. ఈ కథతో ఆయన విజయ్ దేవరకొండను సంప్రదించడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. అయితే మొదట మహేశ్తో సినిమా పూర్తి అయిన తరువాతే విజయ్తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్తో కూడా సుకుమార్ ఓ సినిమా చేయనన్నారని వార్తలు వస్తున్నాయి.మరి వీటిన్నంటిని సుకుమార్ ఎప్పుడు పట్టాలు ఎక్క ఇస్తారో చూడాలి.