అక్కినేని నట వారసుడి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఎందుకనో అనుకున్నంతం సక్సెస్ కాలేదు.సత్యం,గౌరి,గోదావరి వంటి సినిమాలు విజయం సాధించినప్పటికి అవి కెరీర్కు ఉపయోగపడలేదు.ఇటీవలే మళ్ళీ రావా సినిమాతో తన సెంకడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు సుమంత్.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తన తరువాత సినిమాలను లైన్లో పెట్టాడు.సమంత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్యపురం.సస్పెన్స్,థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలైంది.
సుబ్రహ్మణ్యపురం సినిమా సుమంత్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం.టీజర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై మరింత ఫోకస్ పెట్టింది చిత్ర యూనిట్.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. భక్తులను అనుగ్రహించాల్సిన దేవుడే వారిపట్ల ఆగ్రహిస్తే… ఫలితాలు ఎలా ఉంటాయి. కాపాడవలసిన వాడే కన్నెర్రజేస్తే ప్రజల పరిస్థితి ఏంటి ? అసలు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది ? కోపం తెప్పించే పనులు భక్తులు ఏం చేశారు ? వంటి ఆసక్తికర అంశాలతో సుబ్రహ్మణ్యపురం మూవీని తీశామని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెలిపారు. ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా సస్పెన్స్ థ్రిల్లర్ ను తీర్చిదిద్దడంలో నిర్మాత సుధాకర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని చెప్పారు.
నిర్మాత పూర్తి స్వేచ్ఛ, సహకారం ఇవ్వడంతోనే తాము అనుకున్న సబ్జెక్ట్ అనుకున్న విధంగా వెండితెరపై చూపగలిగేలా సినిమాను పూర్తి చేశామన్నారు.బాహుబలి, గరుడవేగ, రంగస్థలం సినిమాలకు గ్రాఫిక్స్ డిజైన్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ అందించిన గ్రాఫిక్స్ మూవీకి హైలెట్ గా నిలుస్తాయని,చిత్ర యూనిట్ భావిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా, యానాం, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో సుమంత్కు జంటగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా నటించింది.సినిమాను సంక్రాంతి బరిలో నిలుపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.