Sunday, May 5, 2024
- Advertisement -

బాల‌రిష్టాలు ప‌డుతున్న సైరా

- Advertisement -

చిరంజీవి సినిమాకు మ‌రో క‌ష్టం

జాతీయ స్థాయి సినిమాగా తెర‌కెక్కించాల‌నే ల‌క్ష్యంతో సినిమాను మొద‌లుపెట్ట‌గా బాలరిష్టాలు ఎదుర్కొంటుంది. సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్దామంటే చిన్న చిన్న కార‌ణాలు మోకాల‌డ్డ‌తున్నాయి. దీంతో సినిమా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ సినిమా విడుద‌ల కూడా ఆల‌స్యమ‌వ‌డం మెగా అభిమానుల‌ను నిరాశప‌రిచే విష‌యం.

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రంగా సైరా నరసింహారెడ్డిలో న‌టిస్తున్నారు. కుమారుడు రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ నిర్మాణంలో సైరాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాతో చిరు తన కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోనే మంచి చిత్రంగా నిల‌వాల‌ని భావిస్తున్నారు. అందుకే చారిత్రక నేప‌థ్యంతో కూడిన క‌థ‌ను ఎంపిక చేసుకున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాకు క‌ష్టాలు వ‌చ్చిప‌డుతూనే ఉన్నాయి.
సంగీత ద‌ర్శ‌కుడి ఏ ఆర్ ర‌హ‌మాన్ ఈ సినిమాకు నిరాక‌రించ‌డంతో ఈ సినిమాకు మొద‌టి అడ్డంకి ఏర్ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రని ఇంకా నిర్ణ‌యించుకోలేదు.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌ త‌దిత‌ర న‌టులు నటిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ వీరెవ‌రూ ఆ సినిమాకు అంగీక‌రించిన‌ట్టు తెలియ‌డం లేదు. పైగా ఈ సినిమా షూటింగ్ రోజురోజుకు ఆల‌స్య‌మ‌వుతోంది. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డిని మార్చే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌ను సంప్ర‌దించాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర‌బృందం ఉంది.

ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను సురేంద‌ర్‌రెడ్డి పూర్తి చేశాడు. ఎందుకో రామ్‌చ‌ర‌ణ్ అసంతృప్తితో ఉన్నాడ‌ట‌. టైమ్‌కు సినిమా పూర్తి కాక‌పోతే ఎలా అని ఆలోచిస్తున్నాడ‌ట‌. వీటికి తోడు కొత్త‌గా మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డింది. రెండో షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండ‌గా న‌య‌న‌తారతో ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉందట‌. నయనతార డేట్స్ కేటాయించడంలో నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ట‌. ముందుగా హీరో-హీరోయిన్ సీన్స్‌ను పూర్తి చేసి గ్రాఫిక్ పనులు కూడా సైమల్టేనియ‌స్‌గా ప్రారంభించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. నయన్ కారణంగా బ్రేక్ పడుతోందని తెలుస్తోంది.

అయితే చిరంజీవితో ఖైదీ నంబ‌ర్ 150 సినిమా స‌మ‌యంలోనే న‌య‌న‌తార‌ను అనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. ఏవేవో కార‌ణాల‌తో ఆమె న‌టించ‌లేదు. రెండోసారి ఆమెను సంప్ర‌దించారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు డేట్స్ ప్ర‌క‌టిస్తుందో చూడాలి.ఏది ఏమైనా ఈ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి క‌ష్టాలు ఎదుర్కొంటోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా పూర్త‌యితే అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మంచి చేకూర‌నుంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -