Tuesday, April 30, 2024
- Advertisement -

రానా సినిమా కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన టబు

- Advertisement -

గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ టబు ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ‘అంధాదున్’, ‘దే దే ప్యార్ దే’ వంటి సినిమాలతో సూపర్ సూపర్ హిట్ లు అందుకున్న టబు మార్కెట్ కూడా బాగా పెరిగింది. తాజాగా ఈమె అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మళ్లీ తెలుగులోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ టబు అప్పుడే మరొక సినిమాను లైన్ లో పెట్టింది.

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఉడుగుల ఇప్పుడు ‘విరాటపర్వం 1992’ అనే మరొక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రానా మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం టబు ఏకంగా 60 ల‌క్ష‌లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి కి టాలీవుడ్ లో టబు కి ప్రస్తుతం అంతా మార్కెట్ లేకపోయినప్పటికీ టబు ఉంటే సినిమాకి బజ్ వస్తుందని నిర్మాతలు నమ్మి, అడిగినంత ఇచ్చేస్తున్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -