- సందీప్కిషన్తో హీరోయిన్గా తమన్నా
పాలను మించిన తెలుపు.. మిల్క్ బ్యూటీకి కష్టకాలం వచ్చింది. బాహుబలిలో మెరిసినా అవకాశాలు రావడం లేదు. దీంతో ప్రత్యేక గీతాలపై దృష్టి సారించింది. అయినా అవకాశాలు తన ఇంటికి.. ఫోన్కు సమాచారం రావడం లేదు. దీంతో ఏదో ఒక సినిమా చేయాలనే ఆలోచనతో తమన్నా చివరికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చివరికి పరాజయాలు పొందుతున్న ఓ కుర్ర నటుడితో జతకడుతోంది.
సందీప్ కిషన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ విజయాలు దక్కడం లేదు. అయినా సినిమాలు చేస్కుంటు వెళ్తున్నాడు. చివరికి కృష్ణవంశీతో కూడా చేసినా కలిసి రాలేదు. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులు బాగోలేక చివరికి తమన్నా సందీప్ కిషన్తో కలిసి హీరోయిన్గా నటిస్తోందంట. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు చేసిన తమన్నాకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చి పడింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో విజయాల బాట పట్టిన ఈ అమ్మడు బాహుబలిలో సినిమా అవంతికగా మెరిసింది. కెమెరామన్ గంగతో రాంబాబు, 100% లవ్, బెంగాల్ టైగర్, రచ్చ, ఆగడు, రెబల్ సినిమాల్లో నటించింది.ప్రస్తుతం కల్యాణ్రామ్ హీరోగా చేస్తున్న మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎమ్మెల్యే) సినిమాలో నటిస్తోంది.