టాలీవుడ్లో భారీ మల్టీస్టారర్కు తెరలేపాడు దర్శక ధీరుడు రాజమౌళి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయింది.బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ఆర్ ఆర్ ఆర్(వర్కింగ్ టైటిల్) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ సినిమాపై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.తమ్మారెడ్డి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ పై తన అభిప్రాయాలు తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమా యావత్తు మొత్తం తెలుగు వారి గురించి మాట్లాడుకునేలా రాజమౌళి చేశారని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.
రామ్ చరణ్ కూడా రంగస్థలం సినిమాతో తన స్టామినా ఏంటో నిరుపించాడు.ఇక ఎన్టీఆర్ వరుస హిట్లు కొడుతున్నాడు.ఇలా సక్సెస్లో ఉన్న ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని తెలిపారు తమ్మారెడ్డి.ఈ సినిమా ప్రపంచం మొత్తం విడుదల అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.దాదాపు 10 వేల స్క్రీన్ల మీద సినిమా విడుదల అవుతుందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.రామ్చరణ్,ఎన్టీఆర్ల క్రేజ్ కన్నా రాజమౌళి క్రేజే ఎక్కువుగా ఉందని ఆయన తెలిపారు.రాజమౌళి క్రేజ్కు తోడు రామ్చరణ్,ఎన్టీఆర్ల స్టామినా యాడ్ అయితే సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమా మొదటి రోజున ఈజీగానే 200 కోట్ల మార్కెట్లో చేరుతుంది,వీకెండ్లో 500 కోట్ల మార్కెట్లో చేరుతుందని ఆయన జోస్యం చెప్పారు.
బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది సినిమా విడుదల తరువాతే తెలుస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.అయితే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే దమ్ము కేవలం ప్రభాస్కే ఉందని వారు చెబుతున్నారు.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో సినిమా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతుంది.ఈ సినిమాతో ప్రభాస్ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటాడని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఎవరి రికార్డులను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.