కెరీర్ స్టార్టింగ్లో విలన్స్ రోల్స్ చేస్తు మంచి నటుడిగా పేరు సంపాదించాడు అడవి శేష్.క్షణం సినిమాతో హీరోగా మారి మంచి విజయం సాధించిన అడవి శేష్ ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని గూడచారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా రిలీజ్ రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అడవి శేష్ స్వయంగా కథను అందించడంతో అందరు అతనిని ప్రశంసిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో అతడు హాట్ టాపిక్ గా మారాడు. ప్రముఖులు అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం ఇతడిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి.. అడివి శేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.గూఢచారి సినిమా షూటింగ్ సమయంలో అడివి శేష్ నా దగ్గరకి వచ్చి ఒక సహాయం కావాలి అని అడిగాడు. తను తీస్తోన్న సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయమని అడిగాడు. నాకు నటించడం రాదని చెప్పినా.. బలవంతపెట్టి మరీ నాతో ఆ పాత్ర చేయించాడు. ఈ సినిమా రిలీజ్ తరువాత కనీసం నన్ను కలవలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ ఇవన్నీ జరుగుతున్నా.. ఆ కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండస్ట్రీలో అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు ఎక్కువ కాలం నిలబడలేరు” అని వెల్లడించారు.