Thursday, May 2, 2024
- Advertisement -

నటి అపూర్వను వేధిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

- Advertisement -

నటి అపూర్వ ఇటీవ‌లే తెలుగు దేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడారు.టీడీపీ పార్టీ క‌మ్మ పార్టీ అని,నేను కమ్మ కులానికి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికి నేను తెలుగు దేశానికి మ‌ద్ద‌తు తెలప‌న‌నిన వ్యాఖ్య‌నించారు.దీంతో ఆమెకు బెదిరింపులు ఎక్కువుగా వ‌స్తున్నాయని ఆమె తెలిపింది.ఆమె ఓ ‘యూట్యూబ్’ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై తనకు అవగాహన ఉందని అపూర్వ తెలిపారు. దెందులూరులో తమది రాజకీయ నేపథ్య కుటుంబమని, తాము టీడీపీకి చెందినవాళ్లమని అన్నారు. 2014లో వైఎస్ జగన్ గెలిస్తే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేడనే అనుమానం ఉండేదని అన్నారు.

అయితే, విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన సమయంలో జగన్ స్పందించిన తీరు చాలా ఉన్నతంగా ఉందన్నారు. . మా నియోజవర్గమైన దెందులూరులో చింతమనేని విజయం సాధిస్తే ఎంతో సంతోషించా. కానీ, తాము ఓట్లేసి గెలిపించిన ఆ ఎమ్మెల్యేనే ఇప్పుడు మాకు నరకం చూపిస్తున్నాడు’’ అని అపూర్వ అన్నారు. ఆయన వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే గెలుపొందితే తాను ఆస్తులు అమ్ముకుని తెలంగాణ వెళ్లిపోతానని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -