Sunday, April 28, 2024
- Advertisement -

ఓ టీవీపై కేసు పెట్టిన టాలీవుడ్ న‌టీన‌టులు

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారంద‌రూ ఓ టీవీపై క‌క్ష గ‌ట్టిన‌ట్టూ క‌నిపిస్తున్నారు. అంద‌రూ ఒక్క‌టై ఓ టీవీ చానెల్‌పై కేసు న‌మోదు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ తెలుగు టీవీ ఛానెల్‌ ఎడిటర్‌పై టాలీవుడ్‌కు చెందిన వారంద‌రూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌త్యేక హోదా విష‌య‌మై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఈ విమ‌ర్శ‌ల‌పై సినీ నటుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణమురళీ ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి ఓ తెలుగు టీవీ ఛాన‌ల్ పోసానితో లైవ్‌ డిబేట్ పెట్టింది. ఆ స‌మ‌యంలో టాలీవుడ్‌లో పనిచేస్తున్న మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా ప‌లువురు మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో టాలీవుడ్‌ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్‌ తదితరులు ఉన్నారు. మా అసోసియేష‌న్ కూడా స్పందించి వారికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -