Thursday, April 18, 2024
- Advertisement -

“ఆ రోజు షూటింగ్ నరకం అలా అనిపించింది” అంటున్న అల్లరి నరేష్

- Advertisement -

అల్లరి నరేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కెరీర్ లోని బాధాకరమైన రోజు గురించి చెప్పుకొచ్చారు. తన తండ్రి ఈవివి సత్యనారాయణ హాస్పిటల్ లో ఉన్నప్పటికీ తను ‘సీమటపాకాయ్’ షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చిందని, దానివల్ల ఆఖరి రోజున తన తండ్రితో గడప లేకపోయాను అనే బాధ ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటుంది అని ఆయన అన్నారు. “ఆ విషయంలో మా అన్నయ్య నా మీద ఇప్పటికీ కోపం గా ఉంటాడు. ఆరోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని ఇప్పటికీ అడుగుతుంటాడు” అని అన్నాడు అల్లరి నరేష్.

“ఆరోజు సీమటపాకాయ్ షూటింగ్ లో మేజర్ కాంబినేషన్ జరగబోతోంది. జయప్రకాష్ రెడ్డి గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వంటి నటులు తరువాత రోజు అమెరికా వెళ్లనున్నారు. అప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ అయి ఉంటే మరో రెండు నెలల్లో షూటింగ్ ఆపివేయాల్సి వచ్చేది. అందుకే ఆ రోజు నేను షూటింగ్ కి వెళ్ళాను” అని క్లారిటీ ఇచ్చారు అల్లరి నరేష్. “షూటింగ్ కి వెళ్లేటప్పుడు నాన్నగారికి బాగా లేదని నాకు తెలుసు కానీ అంత సీరియస్ అవుతుంది అని నేను అనుకోలేదు. మధ్యాహ్నం నాన్న గారి పరిస్థితి బాగాలేదని నాకు ఫోన్ వచ్చింది. ఒకపక్క కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నప్పటికీ మరోపక్క షూటింగ్ లో కామెడీ సీన్ లలో నటించాల్సి వచ్చింది. ఆ రోజంతా నాకు నరకంలా అనిపించింది” అని అన్నారు అల్లరి నరేష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -