వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరీర్లో ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కాగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేయగా తాజాగా ట్రైలర్ని రిలీజ్ చేశారు.
స్టువర్టుపురం అంటేనే దొంగలు. ఆ రోజుల్లో ఈ ఊరి పేరు వింటేనే వణికిపోయేవారు. అంతేగాదు అక్కడ ఎలాంటి లూటీ చేయాలన్న కూడా ముందే ఏరియాలను వేలంపాటలో దక్కించుకోవాల్సి ఉంటుంది అనేలా ట్రైలర్ లో చూపించారు. ఇక ట్రైలర్లో దొంగలలో అతి భయంకరమైన దొంగగా రవితేజను ప్రజెంట్ చేశారు. ఒకవైపు డబ్బు బంగారం పై మొహం పెంచుకున్న టైగర్ మరోవైపు అమ్మాయిలకు ఎలా అట్రాక్ట్ అయ్యాడనేది అద్భుతంగా చూపించారు.
ఇక తర్వాత ఏ కారణంగా జైలుకు వెళ్లాడు…తర్వాత ఎలా తప్పించుకున్నాడు..?ఇక నాగేశ్వరరావు ఆటలను పోలీసులు ఎలా ఆటకట్టించారు అనేది అద్భుతంగా చూపించారు. మొత్తంగా అన్ని అంశాలను జోడించి తెరకెక్కించిన ట్రైలర్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే.