Sunday, April 28, 2024
- Advertisement -

మంచి మనసు చాటుకున్న అలీ దంపతులు

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ గురించి తల్చుకుంటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ప్రతిరోజు సుమారు నాలుగు లక్షల మంది ఈ మహమ్మారి భారిన పడటం.. మూడు వేలకు పైగా మరణాలు సంబవించడం చూస్తూనే ఉన్నాం. అయితే కరోనా ప్రభావంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దాంతో ఎంతో మంది ఉపాది కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీపై పడింది. దాంతో ఎంతో మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కమెడియన్ అలీ, జుబేదా దంపతులు టాలీవుడ్ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, చక్కెర, మరో 8 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తం రూ.2 లక్షల వ్యయంతో 130 మందికి సాయం చేసినట్టు అలీ తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇలాంటి మహిళలు షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారని, తాము తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను కూడా శుభ్రం చేస్తుంటారని వివరించారు. ప్రస్తుతం షూటింగ్స్ లేక ఎంతో మంది కార్మికుల ఇబ్బందులు పడుతున్నారని.. తన వంతు సహాయంగా ఈ మంచి పని చేస్తున్నానని అన్నారు. త్వరలో కరోనా తగ్గిపోవాలని.. అందరూ దీనికి కృషి చేయాలని.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

అలాంటి అబ్బాయిలు అస్సలు నచ్చరు : కృతిశెట్టి

నేటి పంచాంగం,సోమవారం(24-05-2021)

అదే కావాల్సినంత పేరు, డ‌బ్బు తీసుకువ‌స్తోంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -