Monday, April 29, 2024
- Advertisement -

ఆ ఇద్దరు నటులకు వైసీపీ టికెట్ కన్ఫామ్!

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్ది దూకుడు పెంచింది వైసీపీ. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుండగా ఇప్పటివరకు 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక ఈసారి ఇద్దరు సినీ నటులకు ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

కడప, రాజంపేట, బాపట్ల ఎంపీలను కొనసాగించాలని జగన్ నిర్ణయించగా మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా నంద్యాల నుంచి సినీ నటుడు అలీ, రాజమండ్రి నుంచి దర్శకుడు వివి వినాయక్ ను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటంతో పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

అలాగే అనకాపల్లి నుంచి అడారి రమాదేవి, నర్సాపురం అభ్యర్థిగా గోకరాజు గంగరాజు, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, రాజమండ్రి నుండి డాక్టర్ పద్మలత, వంగవీటి రాధా పార్టీలో చేరితే ఆయనకు మచిలీపట్నం టిక్కెట్ చేయించాలని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇద్దరు సినీ నటులకు ఎంపీలుగా ఛాన్స్ దక్కనుండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -